‘మన దేశంలో ఏటేటా వాహనాల సంఖ్య ఎలా పెరిగిపోతుందో . ఇన్ని కోట్ల వాహనాలతో భవిష్యత్తులో వచ్చే కాలుష్యాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతాం…’
దేశవ్యాప్తంగా 21 కోట్లకుపైగా ద్విచక్ర వాహనాలు, ఏడు కోట్లకుపైగా నాలుగు చక్రాలు, ఆపై కేటగిరి వాహనాలు రిజిస్టరయి ఉన్నాయి. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం పార్లమెంటులో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ గణాంకాలు వెల్లడించారు. కేంద్రీకృత డేటాబేస్ ‘వాహన్’ సమాచారం ప్రకారం.. ఆగస్టు 3 నాటికి మొత్తం వాహనాల్లో 5.44 లక్షల బైకులు, 54 వేలకుపైగా నాలుగు చక్రాలు, ఆపై కేటగిరి వాహనాలు విద్యుత్తో నడిచేవి ఉన్నాయని తెలిపారు. సీఎన్జీ, ఇథనాల్, ఫ్యూయల్ సెల్ హైడ్రోజన్, ఎల్ఎన్జీ, ఎల్పీజీ, సోలార్, మిథనాల్ మొదలైన ఇంధన రకాలతో నడిచేవి 2.95 లక్షల ద్విచక్ర వాహనాలు, 18.47 లక్షల నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని డేటా తెలియచేసింది.