‘మనుషులకే కాదు.. కోతులకూ ఓ చోట సొంత భూమి ఉంది.. నిజమే.. మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాలో ఉప్లా గ్రామంలో కోతుల పేరిట 32 ఎకరాల భూమి ఉంది. ఇటీవల గ్రామ పంచాయతీ భూ రికార్డులు పరిశీలిస్తున్నపుడు ఇది బయట పడింది. ”కోతుల పేరున భూమి ఉంది. పత్రాలు ఎపుడు రాసారో తెలియదు.. కానీ ఈ 32 ఎకరాలు కోతులకు చెందుతుంది…”అని ఆ గ్రామ సర్పంచ్ బప్పా పడ్వాల్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో శుభ కార్యాలు జరిగేటప్పుడు ముందు వానరాలకు ఆహరం అందించేవారు.. ఇటీవల ఆ అలవాటు క్రమంగా తగ్గింది. మళ్ళీ ఇటీవల చాలా మంది పాటించడం మొదలుపెట్టారట. ఆహారంలేక అల్లాడిపోతున్న కోతులకు కాస్త ఉపశమనం దొరికింది.