“మట్టే కదా.. అని లైట్ తీసుకుంటే మన తర్వాత తరాలకు మనం ద్రోహం చేసినట్లే. వేల సంవత్సరాలలో పాడుచేయలేని భూసారాన్ని మనం కేవలం నాలుగైదు దశాబ్దాలలో నాశనం చేసేశాం. ఈ వినాశనానికి బ్రేక్ వేయకపోతే మరో 40-50 ఏళ్లకు ఈ భూమి వ్యవసాయానికి పనికిరాకుండా పాడై ఎడారిగా మారిపోతుంది. ” ఈ హెచ్చరిక ఉద్దండులైన్ శాస్త్ర వేత్తలతో పాటు.. ఐక్య రాజ్య సమితి కూడా చేసింది.
ఇపుడు భూసార సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు.. ఈశా ఫౌండేషన్ సద్గురు జగ్గీ వాసుదేవ్ నడుంబిగించారు. సద్గురు చేస్తున్నారు కదా అని మనం ఉదాసీనంగా ఉండొద్దు. మనం, చిన్నారులను ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేద్దాం. విష రసాయనాలతో భూ సారాన్ని నిసారం చేసిన రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు పయనిద్దాం. మితిమీరుతున్న పారిశ్రామిక కాలుష్యానికి చెక్ పెడదాం. మనం నిత్యం వినియోగించే పాలిథిన్ కవర్ల వినియోగానికి తక్షణమే స్వస్తి పలుకుదాం. ఎవరి పాత్ర వాళ్ళం పోషిద్దాం. ఇది మన కనీస కర్తవ్యంగా భావించాలి.
“concious planet – మట్టిని రక్షించు.” అనే నినాదంతో ఈ నెల 21 న లండన్ లో యాత్ర ప్రారంభిస్తున్నారు. బైక్ పై 24 దేశాల మీదుగా 30 వేల కిలో మీటర్ల ప్రయాణం చేసి..కావేరి బేసిన్ వద్ద పర్యటన ముగించనున్నారు. భూసార పరిరక్షణకు సద్గురు చేపట్టిన ఈ యజ్ఞానికి మనకు తెలిసిన వారందరినీ కదిలిద్దాం.. మనమూ అడుగేద్దాం.
ఈ సందర్బంగా సద్గురు మట్టి గురించి శాస్త్రీయ ఆధారాలతో చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే…..
“మట్టి అనేది ఎన్నో కోట్ల జీవరాశులకు ఆవాసం. ఈ జీవాలు అక్కడ జీవించడం వల్లే ఆహరం పండుతుంది. మనం తినగలుగుతున్నాం. జంతువులు బతుకుతాయి. అన్నీ చక్కగా జరిగేది భూమి సారవంతంగా ఉండటం వల్ల. జీవరాశులన్నింటికీ మట్టే మూలం. భూమిలో 36-39 అంగుళాలు 87 శాతం జీవరాశులకు మూలం.
మట్టి సుసంపన్నంగా లేకపోతే ఈ దేహం ఇంకా మన చుట్టూ ఉన్న జీవరాసులు మనలేవు. ఇందులో ఎక్కువ మంది పాలుపంచుకుంటెనే ఇది సాకారమవుతుంది.
ఎపు డైతే భూమిలో సారం మిగలదో మనం ఈ గ్రహాన్ని చేజార్చుకున్నట్లే.
కార్బన్ గురించి, కాలుష్యం గురించి మాట్లాడతాం. అన్నింటి కంటే ముందు .. అపార్థాల వల్ల సామాజిక సమస్యలను పర్యావరణ సమస్యలుగా చూపిస్తారు. ప్లాస్టిక్ కవర్ ని గాలికి వదిలేస్తే అది సామాజిక సమస్య.
అసలు సమస్య మట్టిలోని సారం. తగిన శాస్త్ర పరిశోధనల ద్వారా మనం ఎన్నో భయంకర నిజాలు నమ్మాలి.
ఐక్య రాజ్య సమితి నివేదికలు ప్రకారం.. 80-100 పంటలు 40-50 ఏళ్ళ మాత్రమే సారవంతమైన నేల మిగిలి ఉంటుంది. (మూడొంతులు ఇప్పటికే క్షీణించింది)
30 ఏళ్లలో సేంద్రియ పదార్థాన్ని 80 శాతం కోల్పోయాం. 50 ఏళ్లలో భూమి మీద ఆహార కొరత తలెత్తుతుంది.
కరవు వచ్చినపుడు ఎవరి దగ్గర తుపాకులు ఉంటాయో.. వారు ఆహరం తీసుకుపోతారు. బీదవాళ్లు మాత్రమే చనిపోతారని అనుకోవద్దు.. వాళ్ళు సంపన్నులను చంపేస్తారు . ఇది భయపెట్టడానికి కాదు. ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం ఏర్పడుతుంది. అది మన ఊహకు కూడా అందదు.
మట్టి లోని సారాన్ని ఎందుకు కోల్పోతున్నాం. అడవిలో 70 శాతం సేంద్రియ పదార్థం ఉంటుంది. అదే వ్యవసాయ భూమిలో 3-6 శాతం సేంద్రియ పదార్థం ఉంటే చాలు. అయితే భారత దేశంలో 62 శాతం భూమిలో 0.5 శాతం కంటే తక్కువ కార్బన్ పదార్థం ఉంది. అంటే దాదాపు ఎడారిగా మారిపోతున్నాం. అమెరికాలో భూమి ఉపరితలంపై 12 అంగుళాల వరకు … ఎరువులు, పురుగుమందుల ప్రభావం ఉంది. 80-83 శాతం సారం కోల్పోయింది. ఈ దుస్థితి ప్రపంచ వ్యాప్తంగా ఉంది.”
– సద్గురు జగ్గీ వాసుదేవ్. ఈసా ఫౌండేషన్.
Good