కర్నాటక కాంగ్రెస్ నేత దృవ నారాయణ మృతిచెందారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండె నొప్పి వచ్చింది. కారులో హాస్పిటల్కు తరలిస్తున్న సమయంలో ఆయన ప్రాణాలు విడిచారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నివాళి అర్పించింది. కర్నాటకు చెందిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ద్రువనారాయణ కు గుండెనొప్పి రావడంతో ఇవాళ ఉదయం 6.40 నిమిషాలకు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే ద్రువనారాయణ ప్రాణాలు విడిచినట్లు డీఆర్ఎంఎస్ హాస్పిటల్ డాక్టర్ మంజునాథ్ తెలిపారు. ఛాతిలో నొప్పి రాగానే ఆయన డ్రైవర్కు ఫోన్ చేశాడు. కారులో తరలిస్తున్న సమయంలోనే ద్రువనారాయణ రక్తం కక్కుకున్నట్లు తెలుస్తోంది. తీవ్ర స్థాయిలో బ్లీడింగ్ జరిగింది. ధ్రువ నారాయణ్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు.