చాలా చోట్ల మసీదులు ఉన్న ప్రదేశాలలో శివ లింగాలు, ఇతర హిందూ ఆలయాల ఆనవాళ్లు కనిపిస్తుండడంతో చారిత్రక ఆధారాలను వెలికితీయాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయ్.
‘గతంలో హిం హిందూ దేవాలయాలే ఇప్పుడు మసీదులు మారాయి’ అంటూ యూపీలోని ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్.. తాఖీర్ రజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి. జ్ఞానవాపి మసీదులో సర్వే వివాదాస్పదం అవుతోంది. ఇప్పటికే సర్వేలో భాగంగా మసీదులోని కొలనులో శివలింగం ఉందని గుర్తించిన విషయం కూడా తెలిసిందే. ఈక్రమంలో యూపీలోని ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్..కాంగ్రెస్ నేత తాఖీర్ రజా తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఇపుడున్న చాలా మసీదులు ఒకప్పుడు దేవాలయాలేనని వాటిపైనే మసీదులు నిర్మించారు అని కామెంట్అ చేసారు. కానీ ఆలయాలను కూల్చి వేసి మసీదులను కట్టలేదని..అప్పట్లో ప్రజలు పెద్ద సంఖ్యలోని ఇస్లాంలోకి మారి ఆలయాలను మసీదులుగా మార్చారని వ్యాఖ్యానించారు. అలా నిర్మించిన మసీదులను వివాదం చేయవద్దని వాటిని ముట్టుకోరాదని తేల్చి చెప్పారు.
ఈ విషయంలో ముస్లింలు ఎవరూ న్యాయ పోరాటానికి సిద్ధమవ్వాల్సిన అవసరం లేదన్నారు రజా. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎటువంటి తీర్పు వచ్చిందో తెలిసిన విషయమే కదా అని అన్నారు. జ్ఞానవాపి మసీదుపై ఇప్పుడు ఏ కోర్టుల్లోనూ అప్పీలు చేయబోమన్నారు. విద్వేషవాదులు.. దేశంలోని అన్ని మసీదుల్లోనూ కొలనుల్లో శివలింగాలను గుర్తిస్తారన్నారు. వాళ్లు తలచుకుంటే ఏదైనా జరుగుతుంది అన్నారు. దేశంలో శాంతి సామరస్యాలను కాపాడేందుకు ముస్లింలు శాంతంగా ఉంటున్నారన్నారు. కాగా..జ్ఞానవాపి మసీదులో గుర్తించారంటున్న శివలింగం ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.