సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గత దశాబ్ద కాలంలో విస్త్రృతంగా తన పరిధిని పెంచుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన ఘనత ఫేస్బుక్దే. ప్రపంచంలో ఇప్పటికీ అత్యధికశాతం మంది వినియోగిస్తున్న యాప్ ఇదే. ఇక భారత్లోనూ ఇంటర్నెట్ వాడకం తెలిసిన వారెవరూ ఇందులో అకౌంట్ లేకుండా లేరనే చెప్పాలి. అయితే ఫేస్బుక్ అంతర్గత సర్వే నివేదిక ఆ సంస్థకు షాక్ ఇచ్చిందట. ఇప్పటిదాకా యూజర్ల సంఖ్య పెరగడమే తప్ప తరగడం తెలియని ఆ సంస్థకు గత ఏడాది చివరి త్రైమాసికంలో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందట. యాక్టివ్ యూజర్ల సంఖ్య తగ్గటానికి ఇటీవలి కాలంలో మొబైల్ డేటా ఛార్జీలు పెరగడం కారణమని ఆ సంస్థ పైకి చెపుతున్నా.. అసలు కారణాలు వేరే ఉన్నాయట.
భారత్లో ఫేస్బుక్ వినియోగించే మహిళల సంఖ్య తగ్గిపోతోందట. ఇందుకు తమ భద్రత, ప్రైవసీకి సంబంధించి వారిలో నెలకొన్న భయాలే కారణాలని అంతర్గత సర్వే తేల్చినట్టు సమాచారం. ఫేస్బుక్లో అసభ్య చిత్రాలు దర్శనమివ్వడం, వేధింపులు ఎక్కువకావడం కారణంగానే మహిళలు దీనికి దూరంగా జరుగుతున్నట్టు తేలిందట. ఈ కారణంగానే రెండేళ్ల క్రితమే ఫేస్బుక్ తన యూజర్లకు ప్రొఫైల్ లాక్ ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చింది. అత్యధిక శాతం మంది మహిళలు దీన్ని వినియోగించుకున్నట్టు కూడా సర్వేలో వెల్లడైనట్టు తెలుస్తోంది.
ఇదే సమయంలో ఫేస్బుక్ గ్రూప్కే చెందిన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మాత్రం వృద్దిలో మంచి జోరుమీదుండటం గమనార్హం. గతేడాది నవంబర్ నాటికి దేశంలో ఫేస్బుక్ యూజర్ల సంఖ్య 44.7 కోట్లుగా ఉంటే, వాట్సాప్ వాడేవారి సంఖ్య ఏకంగా 56.3 కోట్లకు పెరిగిందట. ఇక ఇన్స్టాగ్రామ్ను సైతం 31 కోట్ల మంది వినియోగిస్తున్నారట. అంటే ఫేస్బుక్ ఈ రెండింటితో పోలిస్తే వెనుకబడిందని స్పష్టమవుతున్నట్టే. మరి ఈ పరిస్థితిని అధిగమించేందుకు సంస్థ ఏం చర్యలు చేపట్టనుందో చూడాలి.