”ఒకప్పుడు సౌకర్యంగా ఉండే సెల్ ఇపుడు అన్ని వర్గాలకు ఆవసర వస్తువుగా మారింది. అయితే దాన్ని ఎంతవరకు వినియోగించాలో అంతకు పరిమితం చేయకుండా దానికి బానిసై జీవితాలను నాశనం చేసుకునే దుస్థితికి చేరుతున్నారు లక్షలమంది జనం.”
ఫోన్ను కొంతమంది మాత్రమే అవసరం మేరకు వినియోగిస్తుంటే.. మరి ఎంతోమంది అదే ప్రపంచం అన్నట్టుగా.. చుట్టూ ఏం జరుగుతున్నా, కళ్ళు మొబైల్ ఫోన్లలోనే పెట్టి అదే లోకంలో ఉండటాన్ని చూస్తుంటున్నారు.. ఈ విపరీత పరిస్థితిపై సాక్ష్యాత్తూ ‘సెల్ఫోన్ పితామహుడి’గా పిలిచే 94 ఏళ్ల అమెరికా ఇంజినీర్ మార్టిన్ కూపర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘కొంతమంది వ్యక్తులు తమ సెల్ఫోన్లను చూసుకుంటూ.. మైండ్ను ఎక్కడో పెట్టి, అలా రోడ్లు, వీధులను దాటడం చూసినప్పుడు విస్తుపోవడం నా వంతు అయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు పక్క నుంచి వెళ్లినప్పుడు మాత్రమే వారు ఫోన్లో నుంచి బయటకు రావడం గమనించానని పేర్కొన్నారు. ఒకోసారి అది కూడా జరగడంలేదు.. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ముక్యంగా యువత చాల ప్రమాదంలోకి నెట్టబడుతోందని అయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.