” ఇష్టానుసారం తప్పుడు సమాచారం ఇచ్చే యూట్యూబ్ ఛానల్స్ పై కేంద్ర ప్రభుత్వం వేటు వేస్తోంది.” జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నాయన్న కారణంతో 16 యూట్యూబ్ చానళ్లను కేంద్ర సర్కారు బ్లాక్ చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. భారత్ఇం పై తప్పుడు సమాచారం ప్రసారం చేసున్న కారణంగా, పది భారతీయ, ఆరు పాకిస్తాన్ యూట్యూబ్ చానళ్లున్నాయని పేర్కొంది. ‘ఈ యూట్యూబ్ ఛానళ్లు ప్రజల్లో భయాందోళనలను సృష్టించేలా.. పబ్లిక్ ఆర్డర్కు భంగం కలిగించేలా తప్పుడు, ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఈ బ్లాక్ చేసిన యూట్యూబ్ చానళ్లకు 68 కోట్లకుపైగా సబ్స్క్రైబర్లున్నారు.’ అని కేంద్ర సర్కారు పేర్కొంది. కాగా, ఈ నెల ప్రారంభంలోనూ కేంద్ర సర్కారు ఇదే కారణంతో 22 యూట్యూబ్ చానళ్లను బ్లాక్ చేసింది. ఇందులో నాలుగు పాకిస్తాన్కు చెందిన చానళ్లుకాగా, మిగతా 18 భార్త్కు చెందినవి. మరి కొన్నింటిపైనా దృష్టి సారించినట్లు కీలక అధికారి ఒకరు వెల్లడించారు.
యూట్యూబ్ ఛానళ్లతో పాటు భారత్పై దుష్ప్రచారం చేస్తోందన్న కారణాలతో ఓ ఫేస్బుక్ ఖాతాను బ్లాక్ చేసింది కేంద్రం. ఈ యూట్యూబ్ ఛానళ్లు, ఫేస్బుక్ అకౌంట్కు మొత్తంగా 68 కోట్ల వీక్షకులు ఉన్నారు. ‘తప్పుడు, ధ్రువీకరించని సమాచారం భయానక వాతావరణాన్ని, మతపరమైన చిచ్చుకు కారణమవటమే కాకుండా ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఐటీ నిబంధనలు, 2021లోని రూల్ 18 ప్రకారం డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు ఎవరూ సమాచారం అందించలేదు.’ అని సమాచార, ప్రసారాల శాఖ పేర్కొంది.