సముద్రంలో తేలియాడే బ్రిడ్జి ని చూసారా? లేకపోతె ఇది చదవండి.. కర్ణాటకలోని ఉడుపిలో నీటిపై తేలియాడే వంతెన ప్రారంభమైంది. సముద్రంలో 100 మీటర్ల దూరం వరకు ఈ బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళ్లొచ్చు. స్థానిక ఎమ్మెల్యే రఘుపతి భట్. నగరంలోని మాల్పే బీచ్లో ఈ వంతెనను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి తరలివచ్చారు. తేలియాడే వంతెన వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే రఘుపతి.. అధికారులను ఆదేశించారు. ఎల్లప్పుడూ 20-25 మంది గార్డ్స్ ఇక్కడ అందుబాటులో ఉండేలా చూడాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలి తేలియాడే వంతెన ఇదే కావడం విశేషం. కేరళలోని బేపోరేలో ఇలాంటి ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఇదివరకు ఏర్పాటు చేశారు.