”ఉపాధ్యాయులంటే విద్య బుద్దులు నేర్పి వదిలేయడమే కాదు.. విద్యార్థులను భావి, భారత పౌరులుగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పనిచేస్తే పదిమందికీ ఆదర్శంగా నిలుస్తారు..”
విద్యార్థులు అంటే విద్యార్థులు అంటే చదువేనా… కాదు.. చదువుల ఒత్తిడి నుంచి వారికీ మానసిక ప్రశాంతంత కావాలి. అందుకోసం ఆ స్కూల్ నిర్వాహకులు.. వ్యవసాయాన్ని నేర్పారు. ఇప్పుడు విద్యార్థులే రకరకాల పంటలు పండిస్తున్నారు.
విద్యార్థుల్లో వ్యవసాయ అభిరుచిని పెంపొందించేందుకు పాఠశాల పాఠ్యాంశాల్లో వ్యవసాయానికి సంబంధించిన కోర్సులను చేర్చారు. పాఠశాలల్లో విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ పాఠశాల అలాంటి వాటిలో ఒకటి. ..మహారాష్ట్ర.. సాంగ్లీ జిల్లాలోని… జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు భవిష్యత్తులో ఉపయోగపడే వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కడేగావ్ తాలూకాలోని అమ్రాంపూర్లో ఉన్న శివని జిల్లా పరిషత్ పాఠశాలలో అగ్రికల్చర్ కార్యకలాపాలు అమలుచేశారు. పాఠశాల విద్యార్థులకు.. వ్యవసాయ కార్యకలాపాలు, కూరగాయలు, ఫ్రూట్స్, పండించడమే కాదు.. తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, ఇతర ఆహారాల ఔషధ గుణాలు, మూలికా చికిత్స, వ్యాధుల నియంత్రణ, ఆహారం గురించి విలువైన విజ్ఙానాన్ని అందించడానికి ఒక కార్యాచరణగా ఫార్మింగ్ స్కూల్ ప్రారంభించారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా పిల్లలకు విత్తన గుర్తింపు, కూరగాయల ఉత్పత్తి, నీటిపారుదల, కలుపు తీయడం, క్రిమి సంహారకాలు, తెగుళ్ల నియంత్రణ, పంట పెరుగుదల, కూరగాయల పెంపకం, పంట కాలం మొదలైన వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల చదువు కోసం వ్యవసాయ పాఠశాలలో సమాచార డిజిటల్ చార్ట్లను ఏర్పాటు చేశారు.పాఠశాలలో జరుపుతున్న ఆరోగ్య పరీక్షలు… విద్యార్థులకు ఆహారం ద్వారా వచ్చే వ్యాధుల గురించి తెలియజేస్తున్నాయి. దీనిని విద్యార్థులు ప్రాజెక్ట్ ఆధారిత అధ్యయనం, స్వీయ-అధ్యయనం కోసం ఉపయోగిస్తున్నారు. శివానికి చెందిన ఉపాధ్యాయురాలు తానాజీ రామచంద్ర దేశ్ముఖ్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ కింద ఉత్పత్తి చేసిన కూరగాయలు, పండ్లు, మూలికలు, పోషకాహారాలను.. మధ్యాహ్న భోజనంలో ఉపయోగిస్తున్నారు. మొక్కల ఔషధ గుణాలు, ఉపయోగాల గురించి విద్యార్థులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఔషధ చికిత్సలో ఈ మొక్కలను ఉపయోగించడం ద్వారా పిల్లలకు ప్రత్యక్ష అనుభవం కలిగిస్తున్నారు. వ్యవసాయ పాఠశాల ప్రాజెక్ట్ ద్వారా వ్యాధులకు పరిస్కారం చూపుతున్నారు. వ్యవసాయ పాఠశాల కార్యకలాపాల ద్వారా పిల్లల మనస్సులలో వ్యవసాయ పనుల పట్ల ఆసక్తి కలగడంతోపాటు. రైతులంటే విద్యార్థులకు, సమాజంలో ఇతర వర్గాలకు రైతుల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తుందని టీచర్లు చెబుతున్నారు. అంతే కాకుండా.. విద్యార్థులంతా సాఫ్ట్ వేర్ అనో, డాక్టర్ అనో వృత్తులకు పరిమితం కాకుండా కొందరు అగ్రికల్చర్ వైపు కూడా మొగ్గు చూపుతారని రామచంద్ర దేశ్ ముఖ్ అభిప్రాయపడ్డారు.