ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు పేదలు, బాధితులకు భరోసా ఇవ్వడం మొదటి ఓదార్పు. సరిగ్గా ఇదే పని చేస్తుంది మన తెలంగాణ బిడ్డ కీర్తి. అసాం రాష్ట్రంలో కలెక్టర్ గా ఉన్న ఈమె సమస్య ఎక్కడుంటే అక్కడివారిపోతారు. కష్టాలలో ఉన్న వారికీ నేనున్నానంటూ భరోసా ఇచ్చి.. తన అధికారాన్ని ఉపయోగించి తగిన సహాయం చేస్తారు. ప్రభుత్వాన్ని ఒప్పించి వెంటనే సహాయం అందేందుకు ప్రయత్నిస్తారు.
మొన్నటికి మొన్న అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఐఏఎస్ పూజా సింఘాల్ గురించి విన్నాం, కుక్కతో వాకింగ్ కోసం స్టేడియాన్నే ఖాళీ చేయించిన ఐఏఎస్ రింకూ దుగ్గా దర్పాన్ని చదివి విస్తుపోయాం. అయితే, ప్రజల కోసం అహర్నిశలు పాటుపడే ఐఏఎస్లు కూడా ఉన్నారని నిరూపిస్తున్న ఈ కలెక్టరమ్మ పేరు జల్లి కీర్తి. తెలంగాణ బిడ్డే. ఉమ్మడి వరంగల్ జిల్లా తరిగొప్పుల స్వస్థలం. అస్సాంలోని కఛార్ జిల్లాలో ప్రస్తుతం కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల వరదలతో జిల్లాల్లోని పలు ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ఇలా బురద నేలలోనే కీర్తి ఇంటింటికీ వెళ్లి బాధితులను కలిశారు. మన కలెక్టరమ్మపై ఆసాములోనే కాదు.., జాతీయ మీడియా సహా నెట్టింట్లో ప్రశంసల వర్షం కురుస్తోంది.