స్వామి వివేకానంద ఓ సారి చెన్నై వెళ్లారు. అతిథిగా ఆహ్వానించిన వారు ఉదయం అల్పాహారంగా వారికి ఉప్మా పెట్టారు. స్వామీజీకి చాలా నచ్చి “ఇది తేలికపాటి మంచి ఆహరం. రుచికరమైంది కూడా.” అన్నారు. అందుకే ఉప్మాని ఏ విధంగా చేస్తారో తెలుసుకోవాలని అనిపించి, వివేకానంద వడ్డించిన వారిని వివరాలు అడిగారు. అక్కడ ఉన్న వారిలో ఒకాయన ఉప్మా ఎలా తయారు చేస్తారో వివరించారు. అయినా స్వామీజీకి అర్ధం కాలేదు. అక్కడే ఉన్న ఓ గణిత శాస్త్ర అధ్యాపకుడు స్వామీజీతో హల్వా నుంచి పంచదార తీసేసి ఉప్పు కలిపితే ఉప్మా అవుతుంది..” అని చెప్పారు. స్వామీజీ ఆ అధ్యాపకుడిచ్చిన వివరణ విని నవ్వుకున్నారు.