అరుణాచలం ఆశ్రమంలో రమణ మహర్షి వద్దకు రోజూ కళ్లులేని ఓ నిరుపేద వృద్ధ భక్తురాలు వస్తూ ఉండేది. రమణులు గిరి ప్రదక్షిణ చేసి వచ్చే వరకు అలా ఎదురుచూస్తూ కూర్చునేది. వారు రాగానే మెల్లిగా వారి సన్నిధిలో వెళ్లి కూర్చునేది. ఒకసారి సరదాగా మహర్షి ఆ వృద్దురాలితో..’అవ్వా, నువ్వు నన్ను చూడలేవు కదా., అయినా ఎందుకు ఆలా పొద్దునే కస్టపడి వచ్చి నా ఎదుట కూర్చుంటావు?’ అని అంటారు. అప్పుడు ఆ వృద్ధురాలు అమిత తదాత్మాతతో ‘స్వామీ నేను నిన్ను చూడలేకపోయినా, నువ్వు నన్ను చూస్తావుగా.. అది చాలు’ అంటుంది. ఆ మాటలు వినగానే మహర్షి కళ్ళు ఒక్కసారిగా చెమ్మగిల్లాయి.