శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం, శ్రీ మహావిష్ణువు అయిదు ప్రదేశాల్లో ఉంటాడని విశ్వసిస్తారు. వాటిని ‘స్థితి పంచకం’ అంటారు. అందులో మొదటిది ‘పరిస్థితి’ అంటే వైకుంఠంలో ఉండే విష్ణుదేవుడు, రెండవది ‘వ్యూహస్థితి’ అంటే వివిధ అవతారాలెత్తి దుష్టశిక్షణ, శిష్ట రక్షణ నలిపే రూపం. ఇక నాలుగవది ‘అంతర్యామి’ స్థితి అంటే జీవుల హృదయాల్లో ఉంది తన మహాత్సాన్ని ప్రకటించే వైనం. అయిదవది ‘అర్చస్థితి’.. అంటే విగ్రహరూపాల్లో ఉంటూ ఆయా క్షేత్రాల్లో పూజందుకునే స్థితి. అయితే విశేషంగా తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడి విగ్రహంలో ఈ అయిదు స్థితుల్లోని శక్తిసంపత్తులు, వరాభయాలు ప్రకటితమవుతున్నాయని, ఆధ్యాత్మిక సాధకుల, భక్తుల ప్రగాఢ విశ్వాసం. నూట ఎనిమిది దివ్య తిరుపతుల్లోని ప్రతిమల ప్రాభవమంతా ఒక్క తిరుమల వేంకటేశ్వరుడి మూల విరాట్టులోనే నిబిడీకృతమైందని ఆస్తికుల నమ్మకం. అలాగే సిరులే కాదు.. అణిమాది సిద్దులు కూడా కలిగిన రూపమిది. అందుకే అన్నమాచార్యులు కూడా ‘అణురేణు పరిపూర్ణమైన రూపము, అణిమాది సిరి అంజనాద్రి మేడి రూపము’ అని సప్తగిరీశుడిని సంకీర్తించాడు.