శతాబ్ది ప్రారంభంలో థాయిలాండ్ లోని బ్యాంకాక్ నగరంలో ‘వాట్ త్రాయ్’ అనే బౌద్ధ విహారంలో బుద్ధుని ప్రతిమకు ఆరాధన జరుగుతోంది. 13వ శతాబ్దానికి చెందిన 16 అడుగుల మృణ్మయ విగ్రహమది. భక్తి ప్రపత్తులతో బౌద్ధ బిక్షవులు ప్రతిమను ఊరేగింపుగా తీసుకువెళుతున్నారు. రెండవ రోజు బుద్ధ విగ్రహాన్ని చూసేందుకు ప్రజలు వేళా సంఖ్యలో వీధులలోకి వచ్చారు. ఇంతలో ఆకాశం మేఘావృతమైంది. ఒక్కసారిగా బౌద్ధ బిక్షువుల ముఖాల్లో ఆవేదన. ఆందోళన. వర్షంతో ఆ మట్టి విగ్రహం ఎక్కడ కరిగిపోతుందో, తమ ఆరాధ్యమూర్తి ఎక్కడ అదృశ్యమైపోతాడోనని బాధపడసాగారు. పరదాలతో కప్పి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అయినా వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. బోరున వాన కురవసాగింది. గాలుల వేగం కూడా పెరిగింది. ప్రజలందరూ నలు దిక్కులకు చెదిరిపోయారు. ప్రతిమ మాత్రం వర్షంలో తడుస్తోంది. బౌద్ధ బిక్షువులకు ఏం చేయాలో తోచక నిస్చేస్టులైపోయారు. విగ్రహం క్రమంగా కరుగుతుంది. భిక్షవుల కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. బుద్ధ భగవానునివిగ్రహం బంగారంలా ప్రకాశిస్తోంది. మట్టి విగ్రహం మాటున ఉన్న బంగారు భగవానుడు బయట పడ్డాడు. అది మృఞ్మయమూర్తి కాదు, స్వర్మమూర్తి అని అందరికీ స్పష్టం అయింది. ఆ తర్వాత బౌద్ధ భిక్షవులు తాళపత్ర గ్రంధాలను పరిశీలించారు. 13 వ శతాబ్దంలో విదేశీ దాడుల నుంచి కాపాడుకునేందుకు తమ పూర్వీకులు బంగారు విగ్రహానికి మట్టి పుటను పుసారాని తెలుసుకున్నారు. ‘మట్టి విగ్రహాన్ని ఆరాధించాం ఇన్నాళ్లు… అలాగే నశించిపోయే మన దేహంపై ధ్యానంతో బతికేస్తున్నాం. స్వర్ణ సిద్ధార్థుడి రూపంలో ఉన్న ఆత్మను విస్మరిస్తున్నాం. ఇకనైనా మనలో అంతర్యామిగా ఉన్న బుద్ధుడ్ని వెలికితీద్దాం. అయన బోధనల్ని ఆచరణలో పెడదాం..‘అని బౌద్ధ భిక్షువులు గురువుకు ఉద్బోధించారు. నిజంగా మనం కూడా ఆలా మనలోని ఆ బంగారు బుద్ధుడిని ఆవిషరించుకుందాం.. థాయ్ లాండ్లో నేటికీ ఆ స్వర్ణ సిద్ధార్థుడు పూజలు అందుకుంటున్నాడు.