దీపాల కాంతుల్లో మెరిసిన అయోధ్య, గిన్నిస్ రికార్డులో స్థానం ప్రతి ఏడాదిలానే, ఈసారి కూడా అయోధ్య నగరంతో పాటు సరయు నది తీరంలో దీపోత్సవం వెలుగుల పండుగలా జరిగింది. దీపావళి నాడు అయోధ్యలో దీపోత్సవ్ పేరిట భారీ ఎత్తున వేడుక జరుపుకోవడం ఇది ఆరోసారి. ఈ సారి దీపావళి పండగకు ప్రధాని మోదీ హాజరయ్యారు. మోదీ అయోధ్య రాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరయూ నది ఒడ్డున 22 వేల మంది వలంటీర్లు 18 లక్షలకు పైగా ప్రమిదలను వెలిగించి మరో గిన్నిస్ రికార్డును సృష్టించారు. ప్రధాని మోదీ సమక్షంలో అయోధ్యలో బాణసంచా, లేజర్ షో, రాంలీలా కార్యక్రమాలు జరిగాయి. కనులపండువగా సాగిన ఈ ఉత్స్తవాలను లక్షలాదిమంది తిలకించారు.