ఒకసారి పార్వతీదేవి శివుడ్ని ‘ప్రభూ .. నీకు మరకత లింగం ఇష్టమా? మాణిక్య లింగం ఇష్టమా? ‘అని అడిగింది. అప్పుడు ఆ పరమ శివుడు ‘నాకు మట్టి లింగం చాలు..’ అని అన్నాడు.అలాగే ‘ శంభో’ అంటూ చెంబుడు నీళ్లు పోస్తే చాలు.. తృప్తి చెందుతాడు శివుడు.ఆ మహాదేవుడు అల్ప సంతోషి. అందుకే ఆయనను ‘ఆశుతోషుడు’ అని అంటారు.ఆ గౌరీపతికి కావలసింది నిజమైన భక్తి, ఆ ఒక్క అర్హత ఉంటె, విషాన్ని అయినా అమృతంగా స్వీకరిస్తాడు. ఆర్తితో పిలిచినా వారిని ఆదుకుంటాడు. మానవులకే కాదు మూగజీవులైన సాలె పురుగు, పాము, ఏనుగుకు కూడా ముక్తిని ప్రసాదించిన ఆ ముక్కంటి పరమదయాళువు.