ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ల తయరీలో మోటరోలా సంస్థ కూడా మంచి పోటీపడింది. ఇటీవల కొంచెం వెనుకపడింది. అయితే ఇప్పుడు మళ్లీ పోటీలోకి దిగింది. అంతర్జాతీయంగా తన మోటో జీ82 5జీ స్మార్ట్ ఫోన్ ను రంగంలోకి దించింది. దీని ధర మన కరెన్సీలో సుమారు రూ.27వేలు, జీ82ను త్వరలో భారత్ మార్కెట్లోనూ విడుదల చేయనున్నట్టు మోటోరోలా వెల్లడించింది. ప్రస్తుతం యూరోప్ లో ఈ ఫోన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్లో మంచి ఫీచర్లున్నాయి. మోటో జీ82 5జీ 6.6 అంగుళాల ఓఎల్ఈడీ, ఫుల్ హెచ్ డీ డిస్ ప్లేతో ఉంటుంది. వెనుక భాగంలో మూడు కెమెరాలున్నాయి.
50 మెగాపిక్సల్ ప్రధాన సెన్సార్, 8 మెగా పిక్సల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సల్ మాక్రో లెన్స్ తో ఆ కెమెరాలు పనిచేస్తాయి. ఇక ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు. దీంతో మంచి క్వాలిటీతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో వస్తుంది. పవర్ కీ వద్దే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. మోటోరోలా ఇటీవలే మోటో ఎడ్జ్ 30 విడుదల చేసింది. త్వరలోనే జీ82 5జీ ఇక్కడి మార్కెట్లో విడుదల చేయవచ్చని సంస్థ చెపుతోంది.