- వాహన కాలుష్యం తగ్గించేందుకు కంపెనీ ప్రయత్నం
- సీఎన్ జీ వాహనాలపై మారుతీ సుజుకీ ప్రత్యేక దృష్టి
- ఇప్పుడున్న వాహనాల్లో 70 శాతం మారుతీ కంపెనీవే
- ఆవు పేడతో ఇప్పటి వరకు గోబర్ గ్యాస్ తయారు చేసి వంట చేసుకునేందుకు ఉపయోగించేవారు. ఇపుడు ఆవు పేడను కార్లకు ఇంధనంగా వినియోగించే పరిశోధనలకు మారుతి శ్రీకారం చుట్టింది.
- కర్భన ఉద్ఘారాలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ఆవు పేడతో బయో గ్యాస్ ఉత్పత్తి చేసేందుకు ప్రముఖ కార్ల కంపెనీ మారుతీ సుజుకీ పరిశోధనలు చేస్తోంది. ఈ పరిధోశనలు ఫలవంతం అయితే బయో గ్యాస్, ఇథనాల్ తో నడిచే వాహనాలకు చాలా ఉపయోగమని, ఆయా వాహనాల అమ్మకాలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంధన ఖర్చు తగ్గడంతో పాటు వాతావరణ కాలుష్యం కూడా ఈ వాహనాల వల్ల తగ్గుతుందని చెప్పారు.ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సీఎన్ జీ వాహనాల్లో 70 శాతం వాహనాలు మారుతీ సుజుకీ కంపెనీకి చెందినవే. మిగతా కంపెనీల దారిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీపైనే తన దృష్టి మొత్తాన్నీ సారించకుండా.. సీఎన్ జీ, ఇథనాల్, మిశ్రమ ఇంధనాల ద్వారా మార్కెట్లోకి కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు మారుతీ సుజుకీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా బయో గ్యాస్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఆవు పేడ లభ్యత ఎక్కువగా ఉంటుంది. దీంతో బయో గ్యాస్ ఉత్పత్తి చేసి, దాంతో వాహనాలకు నడపగలిగితే ఇంధన ఖర్చు తగ్గుతుందని కంపెనీ వర్గాల అభిప్రాయం. కాగా, బయోగ్యాస్ ఉత్పత్తి కోసం నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డుతో మారుతీ సుజుకీ ఎంఓయూ కుదుర్చుకుంది. తర్వాత ఎన్ డీడీబీ, ఎస్ఎంసీ, బనాస్ డెయిరీ మధ్య త్రైపాక్షిక ఒప్పందం మేరకు 2024 నుంచి బయోగ్యాస్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటుందని సమాచారం.