బ్రిటిష్ సూపర్కార్ మేకర్ మెక్లారెన్ 2022 ద్వితీయార్ధంలో భారత్ మార్కెట్లోకి రానున్నట్టు అధికారికంగా వెల్లడించింది. ముంబైలో ఈ ఏడాది అక్టోబర్లో తొలి డీలర్షిప్ అందుబాటులోకి రావడంతో మెక్లారెన్ కారు మోడల్స్ అన్నీ దేశీ రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. ఐకానిక్ మెక్లారెన్ ఎఫ్1 తయారీ సంస్ధ మెక్లారెన్ కార్స్ బ్రాండ్ మెక్లారెన్ ఆటోమోటివ్గా అవతరించి స్పోర్టీ, రేసింగ్ కార్ల తయారీలో సత్తా చాటుతోంది. బ్రిటన్లోని సర్రే కేంద్రంగా మెక్లారెన్ టెక్నాలజీ సెంటర్లో తన కార్లను మెక్లారెన్స్ డెవలప్ చేస్తోంది. ఆసియా పసిఫిక్ ప్రాంంలో రిటైల్ నెట్వర్క్ విస్తరణలో భాగంగా ముంబైలో డీలర్షిప్ను ప్రారంభిస్తున్నామని మెక్లారెన్ ఆటోమోటివ్ ఆసియాపసిఫిక్, చైనా మేనేజింగ్ డైరెక్టర్ పౌల్ హారిస్ పేర్కొన్నారు. మెక్లారెన్ ముంబై రిటైల్ సెంటర్ మెక్లారెన్ కార్ బ్రాండ్ కస్టమర్లకు మెరుగైన అవకాశమని మెక్లారెన్ ముంబైకి చెందిన లలిత్ చౌధురి తెలిపారు. ముంబై రిటైల్ సెంటర్లో మెక్లారెన్ జీటీ, హై పెర్ఫామెన్స్ హైబ్రిడ్-అర్టురా, 720ఎస్ కూపే, స్పైడర్, 765ఎల్టీ వంటి మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి.