టూ వీలర్స్ కంపెనీ కవాసాకీ దేశీయ మార్కెట్లోకి ఆల్-న్యూ కవాసాకి `డబ్ల్యూ175 ఎంవై 23` బైక్ను ఆవిష్కరించింది. ఈ బైక్ స్టాండర్డ్, స్పెషల్ ఎడిషన్ వేరియంట్లలో లభిస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ బ్లాక్ డైనమిక్ అపియరెన్స్తోనూ, స్పెషల్ ఎడిషన్ బైక్ క్యాండీ పెర్సిమ్మొన్ రెడ్ యాజ్ ఏ బేస్ కలర్గా లభిస్తుంది. రెండు బైక్ల ఫ్యుయల్ ట్యాంక్పై `డబ్ల్యూ` 3డీ ఎంబ్లం ఉంటుంది. ఈ బైక్ 177 సీసీ సామర్థ్యం ఇంజిన్, 7000 ఆర్పీఎం వద్ద 13 పీఎస్, 6000 ఆర్పీఎం వద్ద 13.3 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
డబ్ల్యూ175 ఎంవై 23 బైక్.. పూర్తిగా మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా తయారైంది. ఈ బైక్లోని ముఖ్య విడి భాగాలన్నీ మహారాష్ట్రలోని పుణెలో గల ఇండియా కవాసాకీ మోటార్స్ ఆర్ అండ్ డీ టెక్నికల్ సెంటర్ డిజైనర్లు, ఇంజినీర్ల బృందాలు అభివృద్ధి చేశాయని కవాసాకీ తెలిపింది.
సెమీ డిజిటల్ రెట్రో స్టైల్ స్పీడో మోటార్, సెమీ డబుల్ క్రెడిల్ ఫ్రేమ్, బ్రైట్ ఎం మల్టీ రిఫ్లెక్టర్ హెడ్ ల్యాంప్, 270 ఎంఎం ఫ్రంట్ డిస్క్ విత్ సింగిల్ చానెల్ ఏబీఎస్, డ్యుయల్ షాక్ రేర్ సస్పెన్షన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. డబ్ల్యూ 175 ఎంవై 23 బైక్ 177 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఎఫ్ఐ ఇంజిన్, 5-స్పీడ్ ట్రాన్స్మిషన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఫ్రంట్ అండ్ రేర్లో 17 అంగుళాల స్పోక్ వీల్స్ అమర్చారు.
కవాసాకీ డబ్ల్యూ 175 ఎంవై 23 బైక్లను డిసెంబర్లో కస్టమర్లకు డెలివరీ చేయనున్నారు. స్టాండర్డ్ డబ్ల్యూ 175 ఎంవై 23 బైక్ ధర రూ.1.47 లక్షల నుంచి మొదలవుతుంది. స్పెషల్ ఎడిషన్ డబ్ల్యూ 175 ఎంవై 23 బైక్ రూ.1.49 లక్షలకు ప్రారంభం అవుతుంది. ఇంట్రడ్యూసరీ ధర పరిమిత బైక్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కవాసాకీ తెలిపింది.