అమరరాజా బ్యాటరీస్ గ్రూప్నకు చెందిన అమరరాజా పవర్ సిస్టమ్స్.. దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ను లేహ్, లదాఖ్లో ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టును నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) నుంచి ఇప్పటికే అనుమతి పొందినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య గౌరినేని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కాలుష్య రహిత రవాణాకు ఈ ప్రాంతంలో శ్రీకారం చుడతారు. హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ ఏర్పాటుకు అనుగుణంగా ఎన్టీపీసీ 5 హైడ్రోజన్ ఫ్యూయ ల్ బస్సులను నడుపుతుంది. భవిష్యత్తులో భారీ స్థాయిలో హరిత హైడ్రోజన్ మొబిలిటీ, స్టోరేజీ ప్రాజెక్టులకు ఇది నాంది అవుతుంది. దేశవ్యాప్తంగా ఫ్యూయలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు దోహదం చేస్తుందనికూడా డైరెక్టర్ అభిప్రాయపడ్డారు. ఎలకా్ట్రలిసిస్ ప్రాసెస్ ద్వారా నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్గా విడగొడతారు. పైలట్ ప్రాజెక్టులో రోజుకు కనీసం 80 కేజీల 99.97 శాతం హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తారు. దాన్ని కంప్రెస్ చేసి నిల్వ చేస్తారు.