క్లౌడ్ సేవల విస్తరణ సాంకేతికత అంతటా పెద్ద ఎత్తున జరుగుతున్నదని మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. ఈ క్రమంలోనే క్లౌడ్ కంప్యూటింగ్దే భవిష్యత్తు అని ఆయన అభిప్రాయపడ్డారు. ముంబైలో జరిగిన ‘మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ రెడీ లీడర్షిప్ సదస్సు’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్లౌడ్, కృత్రిమ మేధస్సు (ఏఐ) కీలకమన్నారు.ఆర్థికాభివృద్ధిలో ఈ రెండూ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నాయన్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా రీజియన్లలో, 200లకుపైగా డాటా సెంటర్లలో మైక్రో సాఫ్ట్పె సంస్థ పెట్టుబడులు పెడుతున్నట్టు స్పష్టం చేశారు. ప్రతీచోట క్లౌడ్ సేవలు అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు.