పింక్ డైమండ్ వజ్రాలకే రారాజుగా నిలిచింది. హాంకాంగ్లో శుక్రవారం నిర్వహించిన వేలంలో అత్యధికంగా రూ. 412. 29 కోట్లు పలికింది. 11.5 క్యారెట్ల బరువున్న విలియమ్సన్ పింక్ స్టార్ డైమండ్ను సోథ్బైస్ హాంకాంగ్ సంస్థ వేలం వేసింది. ఇది రూ.172 కోట్ల ధర పలుకుతుందని కంపెనీ అంచనావేసింది. కానీ, వారి అంచనాలకు మించి ధర పలకడంతో కంపెనీ నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద మొత్తంలో ధర పలికిన రెండో డైమండ్ ఇది. 2017లో వేలం వేసిన 59.60 క్యారెట్ల పింక్ స్టార్ డైమండ్ రూ. 587.84 కోట్ల ధర పలికింది. మొదటి 23.60 క్యారెట్ల విలియమ్సన్ డైమండ్ను 1947లో బ్రిటన్ రాణి దివంగత క్వీన్ ఎలిజబెత్- 2 పెళ్లికి గిఫ్ట్గా ఇచ్చారు.