”వైఎస్ కుటుంబం ప్రమేయంలేకుండా పులివెందులలో బయటవారెవరైనా వచ్చి ఏమైనా చేయగలరని ఎవరైనా అనుకుంటారా” అని తులసిరెడ్డి అన్నారు. వి వేకానందరెడ్డి హత్య విషయంలో ప్రజల తీర్పు స్పష్టమైందని, న్యాయస్థానాల తీర్పు మాత్రమే రావాల్సి ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఆయన నందిగామలోని ఆయ్యదేవర కాళేశ్వరరావు ట్రస్టు స్థలంలోను, కొండపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వివేకానందరెడ్డిని వైఎస్ కుటుంబమే హత్య చేసిందని స్పష్టంచేశారు. వారి అనుమతి లేకుండా పులివెందులలో చీమ కూడా దూరదన్న విషయాన్ని అందరూ గమనిస్తారని పేర్కొన్నారు.