విశాఖ ఏజెన్నీ పరిధిలోని ఆదివాసీలు రేపు బంద్ కు పిలుపునిచ్చారు. దానికి కారణం బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే.. దానిని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు ప్రభుత్వ ప్రతినిధులకు వారు విన్నవించుకున్నా దాని మీద ప్రభుత్వం స్పందించలేదు. ఎస్టీ జాబితాలో ఉన్న వారు ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నారు. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపు అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల బంద్ కు పలు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. వారికి మావోయిస్టులు కూడా మద్దతు తెలిపారు. ఈ చర్యలతో పోలీసులు రంగంలోకి దిగారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ఏజెన్సీ ప్రాంతాల్లో తన సర్వీసులను రద్దు చేసింది. ఏజెన్సీ సందర్శనకు వచ్చిన పర్యాటకులను హోటళ్లు, రిసార్టులు, లాడ్జీల నుంచి వెళ్లనీయవద్దని ఆదివాసీ సంఘాలు పోలీసులకు నిన్నవించాయి.