దేవుడు ప్రకృతిలో అన్ని ప్రాణులకు బతకడానికి సమానంగా వనరులు సృష్టించాడు. ఏ జీవైన తనకు సరిపడే ఆహారం కోసం మాత్రమే ఆరాటపడతాయ్. ఒక్క మనిషి తప్ప. పశు-పక్ష్యాదులు తిండి దొరక్క కొన్ని జాతులు కనుమరుగవుతున్నాయి. ఇంకొన్ని జీవనపోరాటంలో అలసిపోతున్నాయ్. పక్షులు కోసం ప్రత్యేకంగా పంట వేసి కాపు వచ్చేవరకు సాకి పక్షులు తినేందుకు గింజలు అందిస్తున్నాడు…
పల్నాడు ఏరియా నల్లమల ఫారెస్ట్ సమీపంలో కారంపూడి గ్రామ వాసి కొమెర జాజి. వినుకొండ రోడ్ లో కారంపూడి గ్రామంలో జాజి ఆశ్రమం ఏర్పాటు చేశారు. పక్షుల కోసమే సజ్జ, జొన్న, అరిగే, రాగి వంటి అనేక మిల్లెట్స్ వైరైటీలు సాగు చేస్తున్నాడు. ఆహరం సక్రమంగా దొరక్క ఆకలితో అలమటిస్తున్నాయ్. ఈ విషయాన్ని పరిశీలించిన జాజి అటవీ ప్రాంతంలో తిరుగాడే పక్షుల కోసం వేసిన పంట కోతకు వచ్చింది. మనకు సంక్రాంతి పండుగ వచింది. నల్లమల అటవీ ప్రాంతంలో పక్షులకు కూడా ఇపుడు పెద్ద పండుగ వచ్చినట్లు0ది.
పక్షులు కోసం ప్రత్యేకంగా పంట వేయకపోయినా మనం వేసిన పంటలో కొంత పక్షులు కోసం కేటాయిస్తే అది కూడా సహా జీవరాసులపై జాలి చూపినట్లే కదా. అది మన బాధ్యతని మనమంతా గుర్తించాలి.
————