”మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. తనను సీబీఐ అరెస్ట్ చేయవద్దని హైకోర్టులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే..” అవినాష్ రెడ్డి పిటిషన్లో తనను ఇంప్లీడ్ చేయాలనీ సునీత పిటిషన్ వేయడానికి సిద్ధమయ్యారు. సునీత, ఆమె భర్తలపై కూడా అవినాష్ పిటిషన్లో అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే కోర్ట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
సీబీఐ విచారణకు అవినాష్ హాజరు.. ఇదిలా ఉండగా వివేకా హత్య కేసులో సూత్రధారిగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సీబీఐ విచారణకు అవినాష్ హాజరుకావడం ఈ కేసులో మూడోసారి.