శ్రీరామ నవమి కావడంతో నేడు భద్రాద్రి రామయ్య కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. సీతారాముల కల్యాణానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ కల్యాణానికి ఖమ్మం నగరానికి చెందిన అనంత పద్మనాభ కోలాట భక్తబృందం 8 కిలోల గోటి తలంబ్రాలను అందజేసింది. ఈ తలంబ్రాల కోసం వారు మంగళగూడెంలో ప్రత్యేకంగా వరి పండించారు. మొత్తం 50 కిలోల వడ్లు రాగా వాటిని ఆయా గ్రామాల ప్రజలకు పంచారు. వారంతా వాటిని గోటితో ఒలవగా ఎనిమిది కిలోలు వచ్చాయి. శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో సమర్పించారు. రాములోరికి జరగనున్న కల్యాణంలో ఈ గోటి తలంబ్రాలను ఉపయోగించనున్నారు.