”బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య మా కుటుంబంలో జరిగిన అత్యంత ఘోరం.. మా చిన్నాన్న ను అంత దారుణంగా ఎవరు చంపారనేది బయటకు రావాలి..’ అని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదన్నారు. చంపిన వారికీ ఖచ్చితంగా శిక్ష పడాలి..అన్నారు. ”ఈ హత్య కేసు దర్యాప్తును ఎవరూ అద్దికోకూడదు. హంతకులు తేలిపోవాలి. మా చెల్లికి న్యాయం జరగాలి.. బాబాయ్ హత్యలో రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయోమో.. తేలిపోవాలి.. ” అని షర్మిల స్పష్టం చేసారు.