‘రాజధానికి 30 వేల ఎకరాలు కావాలి.. అని .. అమరావతికి తాను వ్యతిరేఖం కాదని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి,, సీఎం అయ్యాకా మాట మార్చారు. అమరావతిని నాశనం చేయాలనీ కంకణం కట్టుకున్న రీతిలో ఆయన వ్యవహార శైలి ఉంది.. తీర్పులు చెపుతూన్న న్యాయమూర్తులకు సైతం కులాలు అంట గడుతూ.. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ,, అమరావతిని సర్వ నాశనం చేయాలనీ జగన్ సంకల్పించారు.. అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై ప్రముఖ దిన పత్రిక ఈనాడు 19-9-2022 న “అమరావతి అంతమే ఎజెండా” శీర్షికన స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది. ఈ కధనం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయింది. “
అమరావతి కేవలం ఒక కులం వారి కోసమే అని మొదలు పెట్టిన జగన్ అండ్ కో ప్రసారం పై ఏయే కులాల వారు ఏ రీతిలో ఉన్నారు.. వారు ఏ విధమైన లబ్ది పొందుతున్నారు.. వంటి అంశాలన్నీ ఈనాడు సవివరంగా పబ్లిష్ చేసింది. దీనిపై కొద్ది పాటి చదవగలిగే వారు సైతం అమరావతిపై జగన్ కక్ష్యను అర్ధం చేసుకోగలిగే రీతిలో ఈనాడు అద్భుతమైన కధనం వేశారు. ఆ కధనం చదివిన లక్షల మంది ఆలోచన చేయడంతోపాటు.. జనంలో అవగాహన కల్పిస్తే జగన్ అండ్ కో విషపు ఆలోచన అర్ధం అవుతుంది.