జనసేన నిర్వహిస్తున్న ‘జనవాణి’ కార్యక్రమాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని వైసీపీ దుష్ట పన్నాగం పన్నుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర కోసం ఆరాటం చూపుతున్న వైసీపీ ఈ ప్రాంతానికి ఏమి చేసిందని ప్రశ్నించారు.
మాజీ సైనికుల భూములు ఆక్రమించిన ధర్మాన ప్రసాదరావు.. ఆ భూములను తిరిగి వారికి ఇవ్వాలని ఈ సందర్బంగా పవన్ డిమాండ్ చేసారు. ఒక వ్యక్తి కోసం వైసీపీ వళ్ళంతా అరాచకాలు చేస్తున్నారు.. ఇది ప్రజలు గమనిస్తున్నారు..అన్నారు. జనవాణి కార్యక్రమానికి సంబందించిన వారు జైలులో ఉండగా కార్యక్రమాన్ని నిర్వహించడం సరికాదని ఆపమన్నారు. అధికారం గుప్పిట్లో పెట్టుకున్న వ్యక్తి వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారన్నారు.