Abhi news
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
Abhi news
అభిప్రాయం
Home ఆంధ్రప్రదేశ్

విశాఖ నుంచి జగన్​ పాలన: మంత్రి అమర్నాథ్​

Suryam Andaluri by Suryam Andaluri
September 9, 2022
in ఆంధ్రప్రదేశ్
విశాఖ నుంచి జగన్​ పాలన: మంత్రి అమర్నాథ్​

మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. స్పష్టమైన బిల్లును అసెంబ్లీలో మళ్లీ ప్రవేశపెడతారని.. గతంలో రాజధానిపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును సవరించి.. కొత్త బిల్లు పెట్టాలనే ఆలోచన చేశామని ఆయన తెలిపారు. అది ఆలస్యమవ్వడానికి కొవిడ్ కారణమని చెప్పారు.  అంతే కాదు ఇంకో ఆసక్తికరమైన విషయాన్ని మంత్రి వెల్లడించారు. అదేమిటంటే ముఖ్యమంత్రి జగన్​ ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి తన పాలన ప్రారంభించవచ్చన్నారు.  విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలన్నది సీఎం జగన్ సంకల్పం. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటే చంద్రబాబు దానిని అడ్డుకునేందుకు అమరావతి ప్రాంత ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

ఈ యాత్ర ఉత్తరాంధ్ర ప్రజలపై చేస్తున్న దండయాత్ర.. అమరావతిలో జరిగిన పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు సహా ఇతర పార్టీ నేతలు సీఎం జగన్​ గురించి చులకనగా, అవహేళనగా మాట్లాడటం సరికాదని మంత్రి అమర్​నాథ్​ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు చేసిన వ్యాఖ్యలు వింటే వారు కూడా విశాఖ ప్రాంత వ్యతిరేకులుగా భావించాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని, అమరావతిలోని 29 గ్రామాలు మాత్రమే అభివృద్ధి చెందాలని, రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదన్న భావనతోనే ఈ సభను ఏర్పాటు చేసినట్లు అర్థం అవుతోందని దుయ్యబట్టారు.

అమరావతి వద్దు అని చెప్పలేదని అమరావతిని కూడా కలుపుకొని 3 రాజధానులు చేసి చూపిస్తామని అందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అమర్నాథ్ స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై అమర్నాథ్​ స్పందిస్తూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆయన స్పష్టమైన వివరణ ఇచ్చిన తర్వాతే ఈ విషయం గురించి మాట్లాడాలన్నారు.  ఉత్తరాంధ్ర ప్రజలను చంద్రబాబు అమరావతి టూ అరసవెల్లి యాత్ర పేరుతో రెచ్చగొడుతున్నారన్నారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజధాని కడతామని ప్రభుత్వం చెబుతుంటే.. వద్దంటూ యాత్ర ఎలా చేస్తారని ప్రశ్నించారు. రైతులు చేస్తున్న పాదయాత్రను వెనకబడిన ఉత్తరాంధ్రపై దౌర్జన్య యాత్రగా పేర్కొన్నారు.  కోర్టు తీర్పును అడ్డం పెట్టుకొని పాదయాత్ర పేరిట ప్రజలను రెచ్చగొచ్చే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Tags: amarnath
ShareSendShareTweet
Previous Post

కపిలతీర్థంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రతిష్టాపన

Next Post

ఇక సరిహద్దులకు యుద్ధ ట్యాంకుల తరలింపు ఈజీ!

Related Posts

జనసేనలోకి చిరంజీవి?  నిజమేనా?
ఆంధ్రప్రదేశ్

జనసేనలోకి చిరంజీవి? నిజమేనా?

August 10, 2023
సంక్షేమ ప్రలోభాలతో డేంజర్..
ఆంధ్రప్రదేశ్

సంక్షేమ ప్రలోభాలతో డేంజర్..

August 6, 2023
మార్గదర్శి కేసులో  జగన్‌‌కు ఎదురుదెబ్బ..
ఆంధ్రప్రదేశ్

మార్గదర్శి కేసులో జగన్‌‌కు ఎదురుదెబ్బ..

August 4, 2023
Next Post
ఇక సరిహద్దులకు యుద్ధ ట్యాంకుల తరలింపు ఈజీ!

ఇక సరిహద్దులకు యుద్ధ ట్యాంకుల తరలింపు ఈజీ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

You May Like

No Content Available
Facebook Twitter Youtube

ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.

Read More

Categories

  • For U
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • అభిప్రాయం
  • ఆధ్యాత్మికం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • జనరల్
  • జాతీయం
  • టూరిజం
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • సోషల్ మీడియా

Pages

  • Contact
  • ఇ-పేపర్
  • Privacy Policy
  • Disclaimer

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved

No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved