తిరుపతి లోని అలిపిరి వెళ్లే మార్గంలో ఉన్న కపిలతీర్థం 36 ఏళ్ల కిందట మూతపడింది. అక్కడ ఉన్నలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. కపిల తీర్థం ప్రధానంగా శైవక్షేత్రం ఎంతో పురాతనమైనది. అయితే అక్కడ ఉన్న ఈ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని 36 ఏళ్ల కిందట మూసివేశారు. మళ్లీ ఆ ఆలయాన్ని పునఃప్రతిష్టాపన జరపడానికి టీడీడీ పనులు ప్రారంభించింది. టీటీడీ పాలకమండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్ వివరాలు తెలిపారు.
ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉన్నదని పండితులు నిర్ణయించారన్నారు. స్వామి ఇక్కడి కోనేరులో స్నానం చేసి, ఆలయంలో పూజలు చేసి సొరంగ మార్గంలో తిరుమలకు వెళ్లేవారని చరిత్ర చెబుతోందని వివరించారు. అందుకు ఆధారాలు కూడా కనిపిస్తున్నాయని, ఇంతటి విశిష్ట ఆలయాన్ని తిరుపతి వాసులు, దేశం నలమూలల నుంచి వచ్చే భక్తులు దర్శించుకునేవారని వెల్లడించారు. పనులు వేగంగా జరుగుతున్నాయని, డిసెంబరు మాసంలో 2, 3, 4 తేదీల్లో పునఃప్రతిష్టాపన కార్యక్రమలు జరుగుతాయని వెల్లడించారు.