విశాఖ జిల్లా బమిడిక లొద్దులో జరుగుతున్న బాక్సయిట్ తవ్వకాలపై రెండేళ్ల నుంచీ గిరిజనులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం, వైసీపీ నేతలు … అక్రమ తవ్వకాలపై నోరు మెదపడంలేదు. దీనిపై తాజాగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ వరుపుల రాజా స్థానిక గిరిజనులతో కలసి ఆందోళన చేపట్టారు. అక్రమ మైనింగ్ ని వెంటనే నిలపుదల చేయాలని వరుపుల రాజా డిమాండ్ చేశారు… బాక్సయిట్ తవ్వకాలు కోసం రౌతుల పూడి మండలం లో గిరిజన భూములు గుండా మరియు , అటవీ ప్రాంతంలో వేసిన అక్రమ రహదారి ఫై కొనసాగుతున్న భారీ వాహనాల రాకపోకలు వెంటనే నిలిపి వేయాలని ఆందోళన చేపట్టిన గిరిజనులకు రాజా మద్దతు తెలిపారు. దబ్బాది వద్ద రిజర్వు ఫారెస్ట్ లో వేసిన రహదారి ఫై రాజా గిరిజనులు తో కలిసి ధర్నా నిర్వహించారు.. గిరిజనులు తో కలిసి అటవీ ప్రాంతం లో అక్రమంగా వేసిన రహదారి ఫై నినాదాలు చేస్తూ కిలోమీటర్లు మేర రాజా నడిచారు…ఈ సందర్బంగా రాజా మీడియా తో మాట్లాడుతూ గిరిజనుల హక్కులు హరిస్తూ, వారి అటవీ సంపదను బాక్సయిట్ రూపంలో దోచుకొంటున్న ప్రభుత్వం ఫై టీడీపీ తరుపున రాజీ లేని పోరాటం చేస్తామన్నారు.. గిరిజనుల భూములలో చెట్లు నరికి వేసి అటవీ ప్రాంతం గుండా బాక్సయిట్ రవాణా కోసం రహదారి నిర్మించుకొంటూ పోతే అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు అని రాజా ప్రశ్నించారు..లేటరైట్ పేరిట విలువైన బాక్సయిట్ ను తరలించుకు పోతూ , కోట్ల రూపాయలు విలువైన గిరిజన సంపదను ప్రభుత్వ పెద్దలు దోచుకొంటుంటే మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు అని రాజా ప్రశ్నించారు….. స్థానిక శాసన సభ్యులు, అధికారులు , కొందరు ప్రభుత్వ పెద్దలు తో కలిసి కోట్లు విలువ చేసే గిరిజన సంపదను దోచుకొంటున్నారు అని రాజా ఆరోపించారు.. వారి దోపిడీ ని . గిరిజన గ్రామాల ప్రజలు ప్రశ్నస్తుంటే స్థానిక శాసనసభ్యులు సహకారం తో గిరిజన లు ఫై అక్రమ కేసులు బనాయించడం దారుణం రాజా అన్నారు… గిరిజన సంపదను పరిరక్షించు కోవడం కోసం, గిరిజన హక్కులు కాపాడు కోవడం కోసం అవసరం అయితే న్యాయ స్థానాల ను కూడా ఆశ్రయిస్తామని రాజా అన్నారు… రాష్ట్ర టీడీపీ బృందం త్వరలోనే ఈ ప్రాంతంలో పర్యటిస్తుందని , గిరిజనులకు అండగా ఉంటామని రాజా అన్నారు..
రాజాతో పాటు.. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంపై సామాజిక వేత్తలు, స్వచ్చంధ సంస్థలు కూడా గిరిజన ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నాయి.
బాక్సట్ ఎక్కడికి తరలిపోతోంది.. ఉమ్మడి విశాఖ జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ లో వందల కోట్ల విలువైన బాక్సయట్ , లేటరైట్ ఖనిజాలు కాకినాడ పోర్టు నుంచి చైనా తరలిపోతున్నట్లు చెపుతున్నారు. అలాగే లేటరైట్ ఏపీ, తెలంగాణ లలో పలు సిమెంట్ ఫ్యాక్టరీస్ కి తరలిపోతోంది. లేటరైట్ మైనింగ్ కి కొన్ని అనుమతులు ఉన్నాయి. వాటిని అడ్డం పెట్టుకుని భమిడిలోద్దు లో భారీ అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు ప్రజా సంఘాలు, ప్రతిపక్ష టీడీపీ , కమ్యూనిస్ట్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాయ్.