” ఆంధ్రప్రదేశ్ర లో రబీ ధాన్యం కొనుగోళ్లలో పెద్ద కుంభకోణం జరుగుతుంది. 17వేల మంది రైతులు ఆధార్తో లింక్ లేకుండా చేసారు. ఈ వ్యవహారంలో రైస్ మిల్లర్లు , అధికారులు జోక్యం వుంది ..” అని ఆరోపించారు వైసీపీ ఎంపీ (రాజ్యసభ సభ్యుడు) పిల్లి సుభాష్ చంద్రబోస్. బోస్ వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర సంచలనమయ్యాయ్న. ఆధార్ లింక్ చేయకుండా తెలివిగా రైతులను మోసం చేస్తున్నారని బోస్ రాజమండ్రిలో మీడియా సమావేశంలో వెల్లడించారు. తన వద్ద ఖచ్చితమైన ఆధారాలు వున్నాయని ఈ సందర్బంగా స్పష్టం చేశారు. దీనిపై సీఐడీ విచారణ చేయాలనీ డిమాండ్ చేసారు. ధాన్యం కొనుగోళ్లను సిఎం జగన్ ప్రతిష్టాత్మాకంగా తీసుకున్నారని చెప్పారు. క్షేత్రస్థాయిలో మాత్రం కొందరు మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. త్వరలో దీనిపై మరిన్ని ఆధారాలను బయటపెడతన్నారు. బోస్ వ్యాఖ్యలతో అధికార వైసీపీ కేడర్ లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ధాన్యం కుంభకోణంలో కాకినాడలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధి పాత్ర కూడా ఉందన్న సంకేతాలు ఇచ్చారు ఎంపీ బోస్. దీనిపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. పిల్లి బోస్ కు వైసీపీలను, రాజకీయాలలోను నిజాయితీపరుడిగా పేరుంది. అలాంటి నేత చేసిన ఆరోపణలకు సహజంగానే బలం చేకూరుతుంది.