‘అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ.. కాదేదీ కవితకనర్హం.. అన్నారే కానీ, మనిషి రూపాన్నీ సబ్బుపై చెక్కవచ్చని మాత్రం ఎవరూ చెప్పి ఉండరు. కానీ తూర్పు గోదావరి జిల్లా రంగంపేటకు చెందిన సైకత శిల్పి, ఆర్టిస్ట్ దేవిన శ్రీనివాస్ మన జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి పురస్కరించుకుని ఆయన రూపాన్ని సబ్బుపై అద్భుతంగా తీర్చి దిద్దారు. గాంధీ, నెహ్రు, ఠాగూర్.,.. ఇలా ఏభైకి పైగా జాతీయ నేతలు సబ్బు చిత్రాలు రూపొందించారు దేవిన శ్రీనివాస్.