‘పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే మన ప్రాంతమంతా సస్య శ్యామలం అవుతుందని ఎంతో ఆశపడ్డవారిలో నేనూ ఒకడ్ని. ఈ ప్రాజెక్ట్ పరిస్థితి చూస్తే నేను బతికుండగా పూర్తవుతుందన్న నమ్మకం నాకు లేదు..’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్స్ చేసారు.
మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్కుమార్ పోలవరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ తాను బతికి ఉండగా పోలవరం పూర్తవడం అసాధ్యమని’ ఆయన అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజశేఖర్రెడ్డి శంకుస్థాపన చేసారు.. పది సంవత్సరాలుగా పనులు చేస్తున్నారు… ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కారకులెవరని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం పోలవరం నిర్మాణ పనులపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇటీవల వచ్చిన వరదల్లో పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి కారణం ఎవరని, ఈ విషయంలో ఎవరిపై చర్యలు తీసుకుంటున్నారని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను తక్షణమే ఆదుకోవాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.