“అమరావతి భూములు రాజధాని అవసరాలకు తప్ప ఇతర వాటినకి తనఖా పెట్టడానికి వీల్లేదు. భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అభివృద్ధి చేసిన ప్లాట్స్ అప్పగించాలి. సీఆర్దీఏ చట్టం ప్రకారం వ్యవహరించాల్సిందే.” అని ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్యాన్ని ఆదేశించింది. ఏపీ మూడు రాజధానులు, సీఆర్దీఏ రద్దు పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. సీఆర్దీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ ను పూర్తీ చేయాలనీ కూడా ఈ ఆదేశాలల్లో పేర్కొంది. అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.రాజధాని పిటిషన్లపై విచారణకు అంగీకరించిన హైకోర్టు.. ప్రభుత్వానికి శాసన అధికారంలేదని ఈ సందర్బంగా స్పష్టం చేసింది. రాజధాని విషయంపై మొత్తం 70 పిటిషన్లపై గురువారం ఉదయం త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలని జగన్ సర్కార్కు కోర్టు మొట్టికాయలేసింది.
ఈ తీర్పు రాజధాని రైతులు, ఆ ప్రాంత ప్రజలకు ఊరటనిచ్చింది. ఈ తీర్పునకు ఒకరోజు ముందే… కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అమరావతిని రాజధానిగా పేర్కొంటూ,, నిధులు కేటాయింపు కూడా చేయడం కొసమెరుపు.