” పెద్దవాడిగా సీఎం జగన్కు చెబుతున్నా,ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయింది.. ఇకనైనా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి” అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు.హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం కొత్త ఎత్తులు వెయ్యొద్దని, అమరావతిపై ప్రోగ్రస్ రిపోర్ట్ కూడా ఇవ్వాలని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని నెహ్రు స్పష్టం చేసారు. హైకోర్టు తీర్పు తర్వాత నెహ్రు.. మీడియాతో మాట్లాడారు. అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటిస్తే సీఎం జగన్ గౌరవం కొంతైనా పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అరకొరగా ఉండిపోయిన పోలవరం నిర్వాసిత కాలనీలు .. పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రి షెకావత్ కు చూపిస్తే నిధులు వస్తాయని నెహ్రు సూచించారు. 155 అడుగుల ఎత్తును తగ్గించే ప్రతిపాదనను విరమించుకోవాలని ఈ సందర్బంగా జగన్ కి జ్యోతుల సూచించారు.