‘ ఆంధ్రప్రదేశ్ లో కీలక రాజకీయ సమీకరణకు బలమైన సంకేతం ఇది.. విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్న నోవాటెల్ హోటల్కి వెళ్లి కలవడం రాజకీయాల్లో తీవ్ర చర్చకు తెరతీసింది. ఈ కలయిక 2024 ఎన్నికల్లో ఇరు పార్టీల పొత్తుకు మార్గం సుగమం చేసినట్లు చెప్పవచ్చు..’
చంద్రబాబు-పవన్ కలయిక తర్వాత ఉమ్మడిగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. ఐదేళ్ల తరువాత చంద్రబాబు-పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన, టీడీపీ ఉమ్మడిగా ప్రెస్మీట్ నిర్వహించారు. ప్రెస్మీట్లో చంద్రబాబు మాట్లాడుతూ… పవన్పై ప్రభుత్వ విధానం సరికాదన్నారు. పవన్కు సానుభూతి తెలిపేందుకు వచ్చానని చంద్రబాబు తెలిపారు. పవన్ మీటింగ్ పెట్టుకున్నరోజే ప్రభుత్వ కార్యక్రమం సరికాదని సూచించారు. పవన్ విశాఖ వదిలి వెళ్లేవరకు ఆంక్షలు పెట్టారని పేర్కొన్నారు. పవన్ వెళ్లే దారిలో లైట్లు కూడా తొలగించడం దారుణమన్నారు. ఒకేరోజు ఎప్పుడు రెండు పార్టీల సమావేశాలు జరగలేదన్నారు. రెండు పార్టీల నేతలు ఎదురుకాకుండా పోలీసులు చూసుకుంటారని చెప్పారు