‘పిచ్చి కుక్కలాంటోడికి అపాయింట్ మెంట్ ఇవ్వడమేంటి? వడికేలాగూ విలువల్లేవ్.. చంద్రబాబుకు ఏమైంది?’
‘నిన్న, మొన్నటిదాకా నోటికొచ్చినట్లు మాట్లాడి, ఇపుడు సిగ్గులేకుండా వస్తే కలిసేస్తారా? పార్టీకి కొన్ని విలువలు ఉంటాయి కదా. సొంత కులపోళ్ళయితే ఎంత దుర్మార్గులైనా క్షమించేస్తారా? అడిగిన వెంటనే అపాయింట్ మెంట్ ఇచ్చేస్తారా? రేపొద్దన్న కొడాలి నాని, పోసాని కృష్ణ మురళి వంటి వాళ్ళూ వస్తారు. వాళ్ళనీ కలిసి గంటలు, గంటలు మాట్లాడేస్తారా? ‘
ఇలాంటి అనేక కామెంట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయ్. ముఖ్య0గా టీడీపీ శ్రేణుల నుంచే ఇవి ఎక్కువగా వస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియా కామెంట్స్ పక్కన పెడితే .. మోహన్ బాబు లాంటి వాడిని కలవడం వల్ల చంద్రబాబుకి, టీడీపీ కి ఏమైనా కలసివస్తుందా? అంటే అదేం కనిపించడంలేదు.
చంద్రబాబుకి క్షమా గుణం ఉందనుకుందాం.. పార్టీలో మెజార్టీ కేడర్ కి ఇష్టంలేని పనికి చంద్రబాబు ఎలా సిద్ధపడతారు? ఇది ముమ్మాటికీ పార్టీకి నష్టమే.. అంటూ ఓ టీడీపీ రాష్ట్ర స్థాయి నేత వ్యాఖ్యానించడం గమనార్హం. టీడీపీకే చెందిన మరో నేత ..’మోహన్ బాబు ముమ్మాటికీ జగన్ కోవర్ట్. ఆ విషయం మా పెద్దాయనకు తెలియడంలేదు. ‘ అని ఆందోళన వ్యక్తం చేశారు.