అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర అనుమతి రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటీషన్ను హైకోర్టు (AP Highcourt) కొట్టివేసింది. పాదయాత్రలో 600 మంది వరకు రైతులు పాల్గొనవచ్చని కూడా ఈ సందర్బంగా ఆదేశాలు జారీ చేసింది. గుర్తింపు కార్డులు ఉన్నవారు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఐడీ కార్డులు రైతుల (farmers)కు వెంటనే ఇవ్వాలని పోలీస్ అధికారులకు హైకోర్టు ఆదేశించింది. పాదయాత్రకు సంఘీభావం తెలిపే వారు రోడ్డుకు ఇరువైపులా ఉండాల్సిందేనని గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. పాదయాత్ర ప్రారంభించుకోవచ్చని రైతులకు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది.