కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట సమీపంలో ఉన్న ప్యారీ షుగర్స్ ఫ్యాక్టరీలో సోమవారం మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం (30), ప్రసాద్ (35)గా గుర్తించారు. మిషనరీ ఎక్విప్మెంట్ సెక్షన్ లో భారీ పైప్ విరిగిపడటంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ నెల 19వ తేదీన ఇదే ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. వారికి యాజమాన్యం రూ 40 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇచ్చారు.
కాకినాడ రూరల్ గ్రామాల్లో ఆందోళన
కాకినాడ రూరల్ మండలం పరిధిలో అనేక రసాయన, ఎరువులు, పురుగుమందుల తయారీ పరిశ్రమలతో పాటు, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వ చేసే భారీ ట్యాంకర్లు ఉన్నాయి. వీటిలో చాలా పరిశ్రమలకు నిబంధలు లోబడి అనుమతులులేవు. అయినా స్థానిక ప్రజాప్రతినిధుల అండ దండలతో ఫ్యాక్టరీస్ యాజమాన్యాలు లాలూచీపడి నడుపుకొస్తున్నారు. ప్రమాదకర పరిశ్రమల నిర్వహణ పై స్థానిక గ్రామాల జనం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.