పెనుకొండలో కియా పేరిట ఏపీఐఐసీ నుంచి కేటాయించిన 63 ఎకరాల భూమి ఎవరికిచ్చారో చెప్పాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నిలదీశారు. ఆ భూమి మొత్తం కియాకే కేటాయించారా? అనే సందేహం వ్యక్తం చేశారు. విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీఐఐసీ పెనుకొండలో భూమి కేటాయించిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఆ 63 ఎకరాల భూమి ఎవరికిచ్చారో చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. కియా సైంటిఫిక్ ప్రాసెస్ యూనిట్ కోసం ఇచ్చినట్టు రాసి తీర్మానాన్ని ఆమోదించారని, అయితే ఆ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నించారు. ఆటోమోటివ్ సంస్థ అయిన కియాకి, సైంటిఫిక్ ప్రాసెస్ యూనిట్ కు సంబంధం ఏమిటని నిలదీశారు. ఈ యూనిట్ ఎక్కడ్నించి వచ్చిందో అర్థం కావడంలేదని నాదెండ్ల ఎద్దేవా చేశారు. ఈ సైంటిఫిక్ ప్రాసెస్ యూనిట్, కియా మోటార్స్ రెండూ ఒక్కటేనా…? అని సందేహాన్ని వ్యక్తం చేశారు.