- ఉత్సాహంగా హర్ ఘర్ తిరంగా..
- జాతీయ సమైక్యత పెంపొందించేలా వేడుకలు
- 300 మీటర్ల త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ
ఆజాది కా అమృత్ మహోత్సవ్, హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ఏడో రోజు ఆదివారం ఉదయం విశాఖ బీచ్ రోడ్ లో 300 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ ఆధ్వర్యంలో విక్టరీ ఎట్ సీ స్తూపం నుంచి అధికారులు, విద్యార్థులు, ప్రజలు భారీ ర్యాలీ గా పార్క్ హోటల్ సర్కిల్ వరకు చేరుకున్నారు. అనంతరం పార్క్ హోటల్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించారు. అజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు 75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలను నిర్వహిస్తున్నాయని, దానిలో భాగంగా ఏడవ రోజు ఈ భారీ ర్యాలీ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ అన్నారు. 15వ తేదీ వరకు జరిగే అన్ని కార్యక్రమాలలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.