విశాఖపట్నం విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. 1.8 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడి బంగారం విలువ రూ.కోటి వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కోల్కతా నుంచి విశాఖకు బంగారం తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.