విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. లోక్ సభలో టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయమంత్రి భగవంత్ కిషన్ రావు కరాడ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రైవేటీకరణలో భాగంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వందశాతం పెట్టుబడులు ఉపసంహరిస్తామని 2021 జనవరి 27న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.