- కోడికత్తి లాగా రాజకీయ లబ్ధి కోసం వివేకా హత్యను వినియోగించుకున్నారు
- ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులకు హత్యతో సంబంధం ఉంది
- చిన్నాన్నను చంపిన విషయం జగన్కు తెలుసు” డీఎల్
“కోడికత్తి కేసు మాదిరిగానే వివేకానంద రెడ్డి హత్య కేసును రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు. ఉన్నత పదవులలో ఉన్న వ్యక్తులకు ఈ హత్యతో సంబంధం ఉంది. చిన్నాన్నను చంపిన విషయం జగన్కు, వారి బంధువులకు కూడా తెలుసు..” అని మాజీ మంత్రి డీఎల్ రవీంద్ర రెడ్డి ఆరోపించారు.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కడప జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న వైసీపీ పాలనపైనా డీఎల్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. వివేకా హత్య కేసును కూడా రివర్స్ పాలనలోనే నడిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దావోస్ పర్యటనలో ఏపీ ప్రభుత్వం మూడు ఫేక్ ఒప్పందాలు చేసుకుందని ఆరోపించారు.