‘ రోజా. ఏపీ టూరిజం మంత్రి. ఆమె మూడు రోజుల్లో రెండుసార్లు వీఐపీ దర్శనం చేసుకున్నారు. ఇలాంటి వాటి వల్ల సామాన్య భక్తులకు దర్శనం ఆలస్యం కావడంతోపాటు.. ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. తిరుమలలో స్వామివారి చెంత ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ నిబంధనలు కాదని ,తాము మంత్రులమని, తాము చెప్పిందే వేదమనే భావనతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఏపీ క్రీడలు, టూరిజం శాఖ మంత్రి రోజా మరోసారి తిరుమల ఆలయంలో అనుచరులతో కలిసి హంగామా చేశారు. వరుస సెలవుల కారణంగా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కోసం టీటీడీ పాలకవర్గం ఈనెల 21 వరకు అన్ని బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. వీఐపీల సిఫార్సులను, దర్శనాలను రద్దు చేసింది. ఈ నిబంధనలను పక్కను పెట్టిన మంత్రి రోజా అధికారులపై ఒత్తిడిలు చేసి 50 మంది అనుచరులకు చేసి బ్రేక్ దర్శనం కల్పించింది. దీంతో దాదాపు గంటకు పైగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. భక్తుల ఇబ్బందులపై తనకెందుకన్నట్లు వ్యవహరించారు మంత్రి రోజా.
ఇటీవల మరో ఏపీ మంత్రి మంత్రి ఉషా శ్రీచరణ్ కూడా ఇదేరీతిన వ్యవహరించిన విషయం తెలిసిందే.